News December 18, 2025
కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వోకు ఆశా వర్కర్ల వినతి

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.
Similar News
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రిమెట్రిక్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సుగుణ తెలిపారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News January 9, 2026
KNR: ‘యూరియా నిల్వలు పుష్కలం..: ఆందోళన వద్దు’

కరీంనగర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత పది రోజుల్లోనే వివిధ సొసైటీల ద్వారా 6,513 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 1,833 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరానికి తగినట్లుగా ఎరువులను తెప్పిస్తున్నామని, రైతులు తమ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు.


