News December 18, 2025
భూపాలపల్లి: 23 ఏళ్లకే సర్పంచ్

జిల్లాలోని కాటారం మండలం గుమ్మలపల్లి సర్పంచ్గా 23 ఏళ్ల భక్తు శరత్ కుమార్ ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహదేవపూర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న శరత్, పిన్న వయస్కుడైన సర్పంచిగా గుర్తింపు పొందారు. రాజకీయాల ద్వారా గ్రామాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని శరత్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News January 17, 2026
హైదరాబాద్కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

కాలుష్యానికి కేరాఫ్గా మారిన హైదరాబాద్కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News January 17, 2026
IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.
News January 17, 2026
TU: ఈ నెల 21 నుంచి పరీక్షలు

టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH)-3, 5, IMBA-3, 5, LLB, LLM-3, B.Ed, B.P.Ed-1,3వ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. LLB పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు, LLM పరీక్షలు ఈ నెల 21, 23 తేదీల్లో, ఇంటిగ్రేటెడ్ PG, IMBA పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు B.Ed పరీక్షలు 21 నుంచి 31 వరకు, B.P.Ed 21 నుంచి 24 వరకు జరగనున్నాయి.


