News April 21, 2024
సిర్గాపూర్: హత్య కేసులో 9 మంది పై కేసు

సిర్గాపూర్ మండలం సింగర్ బోగుడ తండాలో జరిగిన <<13093035>>హత్య ఘటన<<>>లో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై మహిపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. సింగర్ బోగుడ తండాలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శ్రీను నాయక్ పై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా, పరిస్థితి విషమించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News July 10, 2025
మెదక్: యాప్లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
News July 10, 2025
మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
News July 9, 2025
మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.