News December 18, 2025

ప్రశాంత ఎన్నికలకు సహకరించిన ప్రజలకు సీపీ కృతజ్ఞతలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా సహకరించిన జిల్లా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా సీపీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 11, 2026

కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.

News January 11, 2026

కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన ధీరుడు వడ్డే ఓబన్న

image

నొస్పం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న వీరోచిత పాత్ర పోషించారు. వడ్డెరలు, బోయలు, చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసిన వీరుడు వడ్డే ఓబన్న. ఈయన నంద్యాల(D) సంజామలలో 1807 జనవరి 11న వడ్డే సుబ్బమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ఇవాళ ఆయన 219వ జయంతి.

News January 11, 2026

రామగుండం చేరుకున్న DCM భట్టి, మంత్రులు

image

గోదావరిఖనిలో జరిగే బహిరంగ సభకు డిప్యూటీ CM భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ చేరుకున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, NTPC- ED చందన్ కుమార్ సమంతా, INTUC నేత జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.