News December 19, 2025
టాంజానియాలో మునుగోడు వాసి మృతి

మునుగోడు మండలం పలివెలకి చెందిన బడుగు రాజు టాంజానియాలో గుండెపోటుతో మరణించాడు. రాజధాని దారుస్సలాంలో జియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆయన, విధి నిర్వహణలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. రాజు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులతో వారు నిరంతరం జరుపుతున్నారు.
Similar News
News January 12, 2026
నల్గొండ జిల్లాలో ఈరోజు టాప్ న్యూస్

చెరువుగట్టులో పాలకమండలి లేక భక్తుల ఇబ్బందులు
కట్టంగూరు: అటవీ భూముల్లో మట్టి అక్రమ తరలింపు
చిట్యాల: హైవే డివైడర్ మధ్యలో మంటలు
చిట్యాల: దాబా ముసుగులో డ్రగ్స్ దందా
నల్గొండ: లక్ష్యానికి దూరంగా మీనం
నల్గొండ : ఏసీబీలో లీక్ వీరులు
కట్టంగూరు: పండుగ పూట ప్రయాణ కష్టాలు
నల్గొండ: కార్పొరేషన్.. గెజిట్ కోసం నీరిక్షణ
నల్గొండ: కార్పొరేషన్గా మారితే.. వీరికి లాభమే
News January 11, 2026
నల్గొండ: గంజాయి విక్రయిస్తున్న వారి అరెస్టు

పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్న సయ్యద్ మజీద్ హుస్సేన్, సోహెల్ను టాస్క్ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
News January 11, 2026
నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

పట్టణంలోని రాంనగర్లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.


