News December 19, 2025

విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

image

AP: మెడికల్‌ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.

Similar News

News January 5, 2026

ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

image

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>

News January 5, 2026

ఐకానిక్ వంతెనకు టెండర్లు.. తగ్గనున్న 90kmల దూరం

image

ఏపీ-తెలంగాణను కలుపుతూ సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానిస్తోంది. 1077 మీటర్ల పొడవైన హైబ్రిడ్ వంతెనను EPC విధానంలో నిర్మించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.816.10 కోట్లు కాగా, 36 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్లాలంటే కర్నూలు మీదుగా వెళ్లాల్సి ఉండగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 90kmల దూరం తగ్గనుంది.

News January 5, 2026

టీవీకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు?

image

తమిళనాడులో అధికారమే లక్ష్యంగా BJP పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా విజయ్ TVKతో పొత్తు అవకాశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. లౌకికవాదానికి కట్టుబడిన INCతో సహజ స్నేహం ఉంటుందని ఇటీవల TVK జాతీయ ప్రతినిధి గెరార్డ్ <<18754096>>వ్యాఖ్యల<<>> తర్వాత కాషాయ పార్టీ అప్రమత్తమైనట్లు తెలిపాయి. అధికార DMK వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అమిత్ షా ప్రణాళిక రచిస్తున్నారని పేర్కొన్నాయి.