News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
Similar News
News January 26, 2026
నల్గొండ: షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభం

నల్గొండ జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్ల కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. షోరూంలలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానంలో తొలిరోజు మూడు బైకులకు డీలర్ పాయింట్ వద్దే నంబర్లు కేటాయించారు. డీలర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా, ఆర్టీఓ అధికారులు పర్మినెంట్ నంబర్లు జారీ చేశారు. జిల్లాలో రోజుకు సగటున 100 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, తాజా మార్పుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
News January 25, 2026
NLG: ఈయన జర్నీ ఎందరికో స్ఫూర్తి

దళిత కుటుంబంలో జన్మించినా తన తలరాతను తానే రాసుకోవాలనే దృఢ సంకల్పమే పి.చంద్రయ్యను ఉన్నత స్థానానికి చేర్చింది. చదువును ఆయుధంగా మలుచుకొని, అనేక అవరోధాలను అధిగమిస్తూ ఆయన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా నియమితులయ్యారు. శాలిగౌరారం (M) ఇటుకల పహాడ్ అనే చిన్న గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఆయన ప్రయాణం సాగింది. 31 ఏళ్ల నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసమే చివరకు ఆయనను ఐఏఎస్ చేసింది.
News January 25, 2026
నల్గొండ: మున్సిపల్ పోరు.. ఇన్ఛార్జిలు వీరే..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ కార్పొరేషన్కు MLC కోటిరెడ్డిని ఇన్ ఛార్జిగా నియమించింది. అలాగే నందికొండకు యుగేంధర్ రావు, హాలియాకు విజయసింహారెడ్డి, దేవరకొండకు పాల్వాయి స్రవంతి, మిర్యాలగూడకు లింగయ్య యాదవ్, చండూరుకు వెంకటనారాయణ గౌడ్, చిట్యాలకు చాడ కిషన్ రెడ్డిలను ఇన్ఛార్జిలుగా ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే బాధ్యతను వీరికి అప్పగించింది.


