News December 19, 2025

తరచూ తలనొప్పా! ఈ తప్పులు చేస్తున్నారా?

image

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మెదడు కుంచించుకుపోయి తలనొప్పి వస్తుంది. భోజనం స్కిప్ చేసినా సమస్య రావచ్చు. స్వీట్స్, పలు పిండి పదార్థాలు తిన్నప్పుడు కొందరికి ఈ ఇబ్బంది వస్తుంది. సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువసేపు నిలబడినా కండరాలు ఒత్తిడికిగురై సమస్య రావచ్చు. పడుకునే ముందు గట్టిగా ఉన్న ఫుడ్ తిన్నా, నిద్రలో పళ్లు కొరికినా, రాత్రుళ్లు స్మోకింగ్, డ్రింకింగ్‌, నాణ్యతలేని నిద్ర తలనొప్పికి కారణం కావచ్చు.

Similar News

News January 13, 2026

‘స్కిల్’ కేసు.. అప్పుడు ఏం జరిగిందంటే?

image

AP: 2014-19లో <<18842559>>స్కిల్<<>> డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరిట అప్పటి TDP ప్రభుత్వం రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడిందని గత YCP గవర్నమెంట్ ఆరోపించింది. ఈక్రమంలోనే 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. CBNకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

News January 13, 2026

తిరుమల: శ్రీవారి దర్శనానికి ఎంత టైమ్ పడుతోందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 68,542 మంది వేంకటేశ్వరుడిని దర్శించుకోగా.. 22,372 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్లు ఆదాయం వచ్చిందని TTD వెల్లడించింది.

News January 13, 2026

తెలంగాణలో ‘కొత్త’ పంచాయితీ!

image

రాష్ట్రంలో జిల్లాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో నాటి CM KCR జిల్లాలను విభజించారు. కానీ అది శాస్త్రీయంగా జరగలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ప్రస్తుత CM రేవంత్ ఆరోపించారు. వాటిని సరిచేసేందుకు కమిటీ వేస్తామన్నారు. అయితే ప్రజలకు పాలన దగ్గర చేయాలనే కొత్త జిల్లాలు తెచ్చామని, వాటిని ముట్టుకుంటే అగ్గి రాజేస్తామన్న KTR మాటలతో రాజకీయ దుమారం మొదలైంది.