News December 19, 2025
నంద్యాల జిల్లాకు చెందిన IAS అధికారికి కీలక బాధ్యతలు

అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్గా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన సీనియర్ IAS అధికారి గంధం చంద్రుడును నియమించింది. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు.
Similar News
News January 24, 2026
విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 24, 2026
విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.
News January 24, 2026
కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.


