News December 19, 2025

ఆదిలాబాద్: ​గ్రూప్-3లో రైతు బిడ్డ సత్తా

image

తలమడుగు మండలం అర్లి (కె) గ్రామానికి చెందిన కళ్ల సందీప్ గ్రూప్-3 ఉద్యోగ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. కళ్ల సువర్ణ – కృష్ణ దంపతుల కుమారుడైన సందీప్ రాష్ట్ర స్థాయిలో 202వ ర్యాంక్, జోనల్ స్థాయిలో 28వ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలతో ఆయన ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి పట్టుదలతో శ్రమించి ఈ విజయం సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు హర్షం చేశారు.

Similar News

News January 11, 2026

ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

image

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

News January 11, 2026

KNR: మార్కెట్‌లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ!

image

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంగుల విక్రయాలు జోరందుకున్నాయి. కొత్త డిజైన్ల కోసం మహిళలు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లలో రంగులకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీ. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.

News January 11, 2026

సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

image

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.