News December 19, 2025
జడ్చర్ల: నేటి నుంచి మైనార్టీ గురుకుల క్రీడలు

తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యార్థుల ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు (జోష్-2025) శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జడ్చర్ల మండల కేంద్రంలోని మైనార్టీ బాలుర పాఠశాల వేదికగా ఈ నెల 21 వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఖాజా బహుద్దీన్ తెలిపారు. 3వ జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్, ఖో-ఖో, కబడ్డీ వంటి వివిధ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు.
Similar News
News January 22, 2026
ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మద్యం సరఫరాదారుల నుంచి వసూలు చేసిన రూ.3,500 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
News January 22, 2026
వంటింటి చిట్కాలు

* సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించేటపుడు చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే స్పూన్ శనగపిండి కలపండి చాలు.
* ఓవెన్లో బ్రెడ్ని కాల్చే సమయంలో.. బ్రెడ్తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.
News January 22, 2026
గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.


