News December 19, 2025
రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్: మంత్రి లోకేశ్

AP: టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వాతోపాటు రహేజా ఐటీ పార్క్కు వ్యతిరేకంగా వైసీపీ పిల్స్ దాఖలు చేసిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత భవిష్యత్తు పట్ల జగన్కు ఎందుకింత ద్వేషం అని Xలో ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
Similar News
News January 1, 2026
ఎల్లుండి సూపర్ మూన్

ఈ ఏడాది తొలి పౌర్ణమిన సూపర్ మూన్ ఎల్లుండి కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు. సాధారణం కంటే 15శాతం బిగ్గర్గా 30శాతం ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. కాగా సూపర్మూన్ గత 4 నెలలుగా వరుసగా కనిపిస్తుండటం గమనార్హం. OCT, NOV, DECలోనూ కనువిందు చేసింది. ఇక ఈసారి సూపర్ మూన్ చూడటం మిస్ అయితే నవంబర్ వరకూ ఆగాల్సిందే.
News January 1, 2026
అందుకే దాస్పై ఆరోపణలు: CM రేవంత్

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
News January 1, 2026
మద్యం విక్రయాలకు న్యూ ఇయర్ కిక్కు

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.


