News December 19, 2025
రుద్రంగి మండలాన్ని వణికిస్తున్న చలి

గడిచిన 24 గంటల్లో రుద్రంగి మండలంతో పాటు బోయినపల్లి మండలంలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రుద్రంగిలో 9.9°c, బోయిన్పల్లిలో 10.0°c డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వేములవాడ రూరల్ 10.4°c, ముస్తాబాద్ 11.2°c, గంభీరావుపేట 11.2°c, చందుర్తి 11.2°c, వీర్లపల్లి 11.2°c, ఎల్లారెడ్డిపేట 11.5°c, కొనరావుపేట 12.2°c, సిరిసిల్లలో 12.2°cగా
ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది.
Similar News
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.
News January 15, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ రద్దీకి చెక్

మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లో ఈ సమస్య ఉండొద్దని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి మహేశ్వరం, శంషాబాద్ ట్రాఫిక్ జోన్లుగా విభజించి 4 డివిజన్లు, 10 ట్రాఫిక్ PSలను నెలకొల్పనున్నారు. సమర్థ పర్యవేక్షణకు ట్రాఫిక్ జాయింట్ సీపీని కూడా నియమించనున్నారు.
News January 15, 2026
రేపు ఈ పనులు చేస్తే సకల శుభాలు..

కనుమ రోజున పశువులను పూజించి, గ్రామ దేవతలను దర్శించి వారికి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు సొంతమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవాలి. పితృదేవతలను స్మరించుకోవాలి. పిండి వంటల నైవేద్యాలు పెట్టాలి. మద్యానికి దూరముండాలి. ఈ నియమాలు పాటిస్తే కుటుంబానికి, పశుసంపదకు మేలు జరగడమే కాకుండా వాటి నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది’ అంటున్నారు.


