News December 19, 2025
బ్రిక్స్ పుస్తకాన్ని సీఎంకు అందజేసిన ఎంపీ శబరి

బ్రెజిల్లో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్లో విడుదల చేసిన ప్రత్యేక పుస్తకాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం అందజేశారు. ఈ పుస్తకంలో ఎంపీ ప్రసంగాలు, ఫొటోలు, ఆమె భాగస్వామ్య విశేషాలను పొందుపరచారు. మహిళా సాధికారత, AI, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్య విలువలపై గ్లోబల్ ప్లాట్ఫారమ్లో భారతదేశం తరఫున గొంతు వినిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News January 3, 2026
HYD: ఆ ముగ్గురిపై మరో అధికారి ఉండరు: కర్ణన్

మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తరువాత వాటికి కొత్తగా ముగ్గురు కమిషనర్లు నియమితులవుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు. ఆ ముగ్గురు అధికారులపై మరో ఉన్నతాధికారి ఉండబోరని స్పష్టం చేశారు. ఈ అధికారులు ఎవరికి వారే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. గ్రేటర్ ఎన్నికలు పాలక మండలి ముగిసిన తరువాతే ఉంటాయని అసెంబ్లీ లాబీలో పేర్కొన్నారు.
News January 3, 2026
చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.
News January 3, 2026
మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.


