News December 19, 2025

పల్నాడు: నిరుపయోగంగా సంపద కేంద్రాలు

image

పల్నాడు జిల్లాలో పంచాయతీల ఆదాయం పెంచేందుకు టీడీపీ ప్రభుత్వంలో సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో వందలాది గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుచేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వీటిని వినియోగించడంలో అధికారులు పట్టనట్లుగా ఉండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం అధికమైంది. వీధుల్లో సేకరించిన చెత్త శివారు ప్రాంతాల్లో పడేస్తున్నారు.

Similar News

News January 19, 2026

విశాఖ వ్యాలీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విశాఖ వ్యాలీ జంక్షన్ దగ్గర సిగ్నల్ పాయింట్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 19, 2026

రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 19, 2026

పాంటింగ్‌ను దాటేసిన కోహ్లీ

image

అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో నం.3 పొజిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ(12,676) నిలిచారు. నిన్న న్యూజిలాండ్‌తో మ్యాచులో సెంచరీతో ఈ రికార్డును చేరుకున్నారు. 60+ సగటుతో 93కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆయన కొనసాగుతున్నారు. తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్(12,662), సంగక్కర(9,747), కల్లిస్(7,774), కేన్ విలియమ్సన్(6,504) ఉన్నారు.