News December 19, 2025

అనకాపల్లి: 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక

image

అనకాపల్లి జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి శుక్రవారం తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 8,824 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7,898 టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరులోగా మరో 926 టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. నానో ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

Similar News

News December 25, 2025

ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

image

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.

News December 25, 2025

యలమంచిలి: తండ్రి క్షణికావేశం.. అనాథ అయిన చిన్నారి

image

క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఆ చిన్నారి అనాథ అయింది. బుధవారం యలమంచిలి పట్టణంలో <<18659799>>మాయ<<>> అనే వివాహితను భర్త రాకేశ్ కిరాతంగా చంపాడు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. తల్లి (మాయ) మృతి.. తండ్రి (రాకేశ్) కటకటాలపాలయ్యాడు. దీంతో అనాథగా మారిన ఆ చిన్నారిని అధికారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులకు అప్పగించారు.

News December 25, 2025

అనకాపల్లి: ‘త్వరితగతిన విద్యా రుణాలు మంజూరు చేయాలి’

image

తల్లిదండ్రుల సివిల్ స్కోర్ చూడకుండా విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో బ్యాంకు రుణాలు మంజూరుపై సమీక్ష నిర్వహించారు. కౌలు రైతులకు, పీఎం సూర్య ఘర్ పథకానికి పరిశ్రమలు, డెయిరీ, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందజేయాలన్నారు. లక్ష్యానికి మించి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు.