News December 19, 2025
పార్వతీపురం కలెక్టర్ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమలు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అమలు చేసిన ముస్తాబు కార్యక్రమం బాగుందని CM చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రభాకర్ను ప్రశంసించిన విషయం తెలిసిందే. రేపట్ని నుంచి ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల వద్దే విద్యార్థుల్ని చక్కగా రెడీ అయ్యేలా చూడటం, క్లాస్ రూంలు, పరిసరాలను శుభ్రం చేయడం చేస్తారు.
Similar News
News January 12, 2026
ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్కు రెండో విజయం.
News January 12, 2026
అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.
News January 12, 2026
నల్గొండ జిల్లాలో ఈరోజు టాప్ న్యూస్

చెరువుగట్టులో పాలకమండలి లేక భక్తుల ఇబ్బందులు
కట్టంగూరు: అటవీ భూముల్లో మట్టి అక్రమ తరలింపు
చిట్యాల: హైవే డివైడర్ మధ్యలో మంటలు
చిట్యాల: దాబా ముసుగులో డ్రగ్స్ దందా
నల్గొండ: లక్ష్యానికి దూరంగా మీనం
నల్గొండ : ఏసీబీలో లీక్ వీరులు
కట్టంగూరు: పండుగ పూట ప్రయాణ కష్టాలు
నల్గొండ: కార్పొరేషన్.. గెజిట్ కోసం నీరిక్షణ
నల్గొండ: కార్పొరేషన్గా మారితే.. వీరికి లాభమే


