News December 19, 2025

పార్వతీపురం కలెక్టర్ ఆలోచన రాష్ట్రవ్యాప్తంగా అమలు

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అమలు చేసిన ముస్తాబు కార్యక్రమం బాగుందని CM చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభాకర్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. రేపట్ని నుంచి ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల వద్దే విద్యార్థుల్ని చక్కగా రెడీ అయ్యేలా చూడటం, క్లాస్ రూంలు, పరిసరాలను శుభ్రం చేయడం చేస్తారు.

Similar News

News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

News January 21, 2026

పల్నాడు: ‘రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి’

image

పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, భూ సర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సేవలు సమర్థంగా అందించాలని పేర్కొన్నారు.

News January 21, 2026

జనవరి 21: చరిత్రలో ఈరోజు

image

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం