News December 19, 2025
TU: సౌత్ క్యాంపస్ను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

భిక్కనూరు మండల పరిధిలోని టీయూ సౌత్ క్యాంపస్ను శుక్రవారం జిల్లా డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డా.శిరీష తనిఖీ చేశారు. బాలుర వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనాలను మోతాదుకు అనుగుణంగా ఉపయోగించాలన్నారు. నాణ్యమైన సరుకులు వాడాలని, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని వార్డెన్ డా.యాలాద్రికి సూచించారు. క్యాంపస్లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News December 29, 2025
కామారెడ్డి: వృద్ధురాలి హత్య.. నిందితుడి అరెస్ట్

వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు.. లింగంపేట(M) పోల్కంపేటకు చెందిన సులోచన(67) ఈ నెల 27న తన ఇంట్లో రక్తపు గాయాలతో శవమై కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ముద్రబోయిన కుమార్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె నుంచి దొంగిలించిన 4 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునామన్నారు.
News December 29, 2025
డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు

✒1530: బాబర్ పెద్దకొడుకు హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు ✒1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్ఆలీ కమీషన్ ఏర్పాటు
✒1965: మొదటి యుద్ధట్యాంకు వైజయంత ఆవడి తయారుచేసిన భారత్
✒1974: సినీ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా జననం
✒1910: ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ జననం
✒2022: బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు పీలే మరణం(ఫొటోలో)
News December 29, 2025
ఆ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్, యూరప్తో తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరాన్ సొంత కాళ్లపై నిలబడటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదని, తమను మోకరిల్లేలా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఇది మనపై ఇరాక్ చేసిన యుద్ధం కంటే దారుణమైనది. చాలా క్లిష్టమైనది. అన్నివైపుల నుంచి ముట్టడిస్తున్నారు. జీవనోపాధి, భద్రతాపరంగా సమస్యలు సృష్టిస్తున్నారు’ అని అన్నారు.


