News December 19, 2025
రావికమతం: సీఎం ప్రారంభించనున్న స్వచ్ఛ రథాలు ఇవే..

జిల్లాలో 3 మండలాలలో స్క్రాప్ వస్తువుల సేకరణకు స్వచ్ఛ రధాలు రావికమతంలో తయారవుతున్నాయి. ఈ నెల 20న తాళ్లపాలెంలో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీకి ఇచ్చిన వాహనాలను స్వచ్ఛ రథాలు మార్పు చేశారు. అనకాపల్లి, అచ్చుతాపురం, రావికమతం మండలాలో ఈ రధాలు ఊరురా తిరిగి స్క్రాప్ వస్తువులు ఖరీదు కట్టి నగదు, కిరాణా సరుకులు ఇస్తారు.
Similar News
News January 15, 2026
ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
News January 15, 2026
TODAY HEADLINES

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన
News January 15, 2026
WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.


