News April 21, 2024

నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా రామరాజు

image

AP: నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. కాగా ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం ఉండి సీటుని రామరాజు వదులుకున్నారు. అలాగే ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని నియమించారు.

Similar News

News March 17, 2026

SHOCKING: నిమ్మరసానికి గ్యాస్ బిల్లు

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో చాలా హోటళ్లు ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరిట అదనంగా వసూలు చేస్తున్నాయి. అయితే గ్యాస్ అవసరమే లేని పదార్థాలకు కూడా ఈ ఛార్జీలను అంటగట్టడం విమర్శలకు దారితీసింది. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్ 2 నిమ్మరసాలు ఆర్డర్ చేయగా రూ.358తో పాటు అదనంగా రూ.17(5%) గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వేశారు. బిల్ ఫొటో వైరలవడంతో జ్యూస్‌కు గ్యాస్ బిల్ వేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

News March 17, 2026

వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు

image

తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సభ వాడీవేడిగా జరిగింది. ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు స్పష్టం చేశారు.

News March 17, 2026

పైపుల ద్వారా గృహాలకు KG బేసిన్ గ్యాస్: CBN

image

AP: రాష్ట్రంలో 14000 MT LPG నిల్వలు ఉన్నాయని, అదనపు గ్యాస్ రాబోతోందని CM CBN తెలిపారు. ప్రజలకు సరఫరాలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. గ్యాస్ సరఫరాపై అధికారులతో CM సమీక్షించారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ మరింత విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ఇళ్లకు సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు.