News December 19, 2025
పార్వతీపురం: ‘సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలి’

సత్ప్రవర్తనతో ఖైదీలు తమ శిక్షను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పార్వతీపురం సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించి జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 27, 2026
కడపలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్.!

వారంరోజులుగా దేవుని కడప ఉత్సవాల్లో పోలీసులు బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని కడపలోని అన్ని PSల పరిధిలో 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. రిమ్స్ పరిధిలో శిల్పారామం, చిన్నచౌక్ పరిధిలోని YSR కాలనీ, వన్ టౌన్ పరిధిలోని 4 ఇళ్లలో చోరీలు చేశారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి దొంగలను వెంబడించగా అతనిపై రాళ్లు విసిరి పరారయ్యారు.
News January 27, 2026
యూనివర్సిటీల్లో 2,125 ఖాళీలు!

TG: యూనివర్సిటీల్లో 2,878 పోస్టులకు 753 మందే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 2,125 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నిర్వహణ సాగుతోంది. పోస్టుల భర్తీకి 2018లో అనుమతిచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. నియామకాల్లో తమకు న్యాయం చేయాలన్న కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనతో ప్రక్రియ నిలిచిపోయింది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సమాచారం. చివరగా 2013లో నియామకాలు జరిగాయి.
News January 27, 2026
చారిత్రక వైభవం.. ఉయ్యూరు వీరమ్మ తల్లి ఉత్సవం!

ఐదు శతాబ్దాల చరిత్ర గల ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు భక్తిశ్రద్ధలతో ప్రారంభమవుతున్నాయి. పెదకడియంలో జన్మించిన వీరమ్మ, భర్త మరణానంతరం సహగమనం చేసిన మహాసాధ్వి. మాఘ శుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ‘ఉయ్యాల ఊయింపు’ ఘట్టం అత్యంత ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ తిరునాళ్లలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


