News December 19, 2025
‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.
Similar News
News January 19, 2026
ప.గో: హీరో నవీన్ పోలిశెట్టి సందడి

ఉమ్మడి ప.గో. జిల్లా ఏలూరులో ఆదివారం ‘అనగనగా ఒక రాజు’ మూవీ టీమ్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ సంబరాల్లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా పడమర వీధి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సినిమా ప్రదర్శన అవుతున్న థియేటర్కు వెళ్లి ప్రేక్షకులతో కాసేపు సరదాగా గడిపారు.
News January 19, 2026
ప.గో: ALERT.. కోర్టులో JOBS

ఉమ్మడి ప.గో జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జడ్జి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఏలూరు కోర్టుకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా, నిబంధనల వివరాలను జిల్లా కోర్టు, కలెక్టరేట్, గ్రంథాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.
News January 19, 2026
భీమవరం వన్టౌన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరగనుంది. ఈ మార్పును గమనించి, అర్జీదారులు నేరుగా వన్టౌన్ స్టేషన్కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.


