News December 19, 2025

జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాల అవగాహన సదస్సు

image

SP ధీరజ్ ఆదేశాల మేరకు విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు అవగాహన సదస్సులు నిర్వహించాయి. పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టం, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు వివరించారు. లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 112, శక్తి యాప్ వినియోగంపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.

Similar News

News December 26, 2025

‘రుషికొండ’ను TTDకి అప్పగించాలి: BJP MLA

image

AP: విశాఖపట్నం రుషికొండ భవనాలను, కింద ఉన్న మరికొంత భూమిని ప్రముఖ హోటళ్లకు కేటాయించేలా ఇటీవల మంత్రుల కమిటీ చర్చించడం తెలిసిందే. ఈనెల 28న తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా BJP MLA విష్ణు కుమార్ రాజు దీనిపై స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘రుషికొండను ఆదాయవనరుగా చూడొద్దు. హోటళ్లకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుంది. TTDకి అప్పగించి ఆధ్యాత్మిక సిటీగా మార్చాలి’ అని కోరారు.

News December 26, 2025

KMR: రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదా ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.

News December 26, 2025

ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

image

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.