News December 19, 2025
అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.
Similar News
News January 15, 2026
GNT: జీఎంసీ నేటి సంక్రాంతి సంబరాలు ఇవే!

గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని వెల్ఫేర్ స్థలంలో ఉదయం 9 గంటల నుంచి పొంగళ్లు, కోడి పందేలు, కర్రసాము, ఖోఖో, సాయంత్రం 5 గంటల నుంచి సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రి, బహుమతుల ప్రదానం జరగనుంది. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం NTR స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి మ్యూజికల్ నైట్ ఉంటుంది.
News January 15, 2026
సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News January 15, 2026
సరస్ ప్రదర్శనలో సమర్థవంతంగా పనిచేయాలి: కలెక్టర్

సరస్ ప్రాంగణంలో సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విధులు కెటాయించిన అధికారులు పటిష్టమైన ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నల్లపాడు రోడ్డులోని జరుగుతున్న సరస్ ప్రదర్శనను బుధవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణంలో స్టాల్స్, కంట్రోల్ రూమ్, ఫుడ్ కోర్ట్, ఎమ్యూజ్మెంట్ పార్క్ను కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.


