News December 19, 2025
అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.
Similar News
News January 11, 2026
GNT: ‘చిరు’ సినిమా హిట్ అవ్వాలని అంబటి ట్వీట్!

మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అభిమాన సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై మరోసారి తన అభిమానాన్ని X వేదికగా చాటుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్” చిత్రం విడుదల సందర్భంగా X వేదికగా ఆదివారం అంబటి రాంబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా సూపర్, డూపర్ హిట్ అవ్వాలని అంబటి ఆకాంక్షించారు.
News January 11, 2026
రేపు తెనాలి ఐటీఐలో అప్రెంటిస్ మేళా..15 కంపెనీల రాక

తెనాలి చినరావురులోని ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో ఈ నెల 12వ తేదీ సోమవారం నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని ఐటిఐ పాసైన విద్యార్థులందరికీ అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. అర్హత కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డు నకలుతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పారు.
News January 10, 2026
GNT: నటబ్రహ్మ ముక్కామల.. రంగస్థలం నుంచి వెండితెర దాకా

నటుడు, దర్శకుడు ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో జన్మించారు. న్యాయవాదిగా ఉంటూనే రంగస్థలంపై ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో బుస్సీ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయా మచ్ఛీంద్ర’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి, మాయాబజార్ (దుర్యోధనుడు), నర్తనశాల, తెనాలి రామకృష్ణ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘మరదలు పెళ్లి’, ‘రుష్యశృంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.


