News December 20, 2025
నెల్లూరు: వైసీపీలోనే ఆ ముగ్గురు..!

TDPకి షాక్ ఇచ్చిన నలుగురు కార్పోరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగనున్నారు. మాజీ మంత్రి అనిల్ ఆధ్వర్యంలో మద్దినేని మస్తానమ్మ, కాయల సాహిత్య, వేనాటి శ్రీకాంత్రెడ్డిలు YS జగన్ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్రెడ్డిని సిటీ ఆఫీసులో కలిశారు. వైసీపీతోనే తమ పయనం సాగుతుందని TDPలో తమకు ఎటువంటి విలువ లేకుండా పోయిందని తెలిపారు.
Similar News
News December 25, 2025
ఉదయగిరి: హనీఫ్ మాస్టర్ ఇక లేరు..!

ఉదయగిరికి చెందిన ‘ఉర్దూ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్’ గ్రహీత షేక్ మహమ్మద్ హనీఫ్ ఖాలిది(77) ఇక లేరు. బుధవారం రాత్రి ఆయన అనారోగ్య సమస్యలతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. ఆయన జీవితాంతం ఉర్దూ భాష అభివృద్ధికి ఎనలేని సేవలందించారు. అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించారు. ఆయన ఎంతో శ్రమించి రచించిన “ఉదయగిరి మహనీయులు” పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో మృతి చెందడం బాధాకరం.
News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.


