News April 21, 2024

రాహుల్ గాంధీకి అస్వస్థత

image

ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా ఇవాళ మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనడం లేదు. రాహుల్ స్థానంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సత్నా, రాంచీ సభల్లో పాల్గొననున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రాహుల్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు.

Similar News

News January 27, 2026

అమల్లోకి ఎన్నికల కోడ్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల <<18974641>>షెడ్యూల్ విడుదలైన<<>> నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SEC రాణి కుముదిని హెచ్చరించారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పారు. 2996 వార్డులకు ఎన్నికలకు జరుగుతాయని తెలిపారు. 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు.

News January 27, 2026

ChatGPT, Geminiతోనే ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ ఓపెన్ చేయక్కర్లేదు!

image

ఇకపై మీ ఫుడ్ ఆర్డర్లను లేదా సరకుల డెలివరీలను ట్రాక్ చేయడానికి స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. నేరుగా ChatGPT, Gemini వంటి AI చాట్‌బాట్‌లతోనే పని కానిచ్చేయొచ్చు. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రొటోకాల్’ సాయంతో స్విగ్గీ ఈ సేవలను ప్రారంభించనుంది. దీంతో చాట్ చేస్తూనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సరకులు తెప్పించుకోవచ్చు. యూజర్ల తరఫున AI ఏజెంట్లే ఈ ప్రాసెస్‌ను పూర్తి చేస్తాయి. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు.

News January 27, 2026

అమరావతికి వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి

image

AP: రాజధాని అమరావతిని వ్యతిరేకించడం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ‘పార్లమెంటులో ప్రవేశపెట్టే అమరావతి బిల్లులో రైతులకు ఇచ్చిన హామీలనూ పొందుపరచాలి. వారికి న్యాయం చేయాలి. దీనిపై సభలో చర్చించాలి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.