News December 20, 2025
కామారెడ్డి: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్లకు దరఖాస్తులు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జయరాజ్ తెలిపారు. జనవరి 19వ తేదీ లోపు స్కాలర్షిప్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 8, 2026
SV వేదిక్ వీసీ రిట్ పిటీషన్ డిస్మిస్

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి హైకోర్టులో వేసిన రిట్ పిటీషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆయనను తొలగించాలని పాలకమండలి నిర్ణయం మేరకు టీటీడీ విచారణ చేపట్టింది. దీనిపై కోర్టు విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
News January 8, 2026
మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.
News January 8, 2026
ఇవాళ మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం

AP: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.


