News April 21, 2024
మైలవరం వైసీపీ అభ్యర్థి సామాన్యుడే

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు ఆస్తి వివరాలు చూస్తే సామాన్యుడే అని అన్నట్లుగా అనిపిస్తుంది. కెనరా బ్యాంకులో ఉన్న అకౌంట్లో రూ.1000, మైలవరం మండల పుల్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూ.9,823 ఉన్నట్లు చూపించారు. తన పేరుతో రూ.73,531 విలువైన 2016 మోడల్ బైకు, రూ.55,200 విలువైన 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంగా రూ.50 వేలు ఉన్నట్లు పొందుపరిచారు.
Similar News
News March 30, 2026
కృష్ణా జిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు

కృష్ణా జిల్లాలో 133 మంది పందెం రాయుళ్లపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కారణంగా బెట్టింగ్లను అరికట్టేందుకు గాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో పలు రకాల బెట్టింగ్లకు పాల్పడిన 133 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.
News March 29, 2026
కృష్ణా: జవహర్ నవోదయ ప్రిన్సిపల్ స్పాట్డెడ్

బాపులపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. వేలేరు సమీపంలో టిప్పర్ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జవహర్ నవోదయ ప్రిన్సిపల్ యాదూనందన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 29, 2026
పీజీఆర్ఎస్ వేదికను వినియోగించుకోండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ప్రతి సోమవారంలాగే ఈ వారం కూడా ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్లో అర్జీలు స్వీకరించనున్నట్లు ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చి త్వరితగతిన పరిష్కారం పొందాలని కలెక్టర్ సూచించారు.


