News December 20, 2025
పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి: నల్గొండ కలెక్టర్

ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రామిక్ ఉన్నారు.
Similar News
News January 23, 2026
NLG: నల్గొండలో త్రిముఖ పోటీ

నల్గొండ కార్పొరేషన్కు జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధం అవుతోంది. షెడ్యూల్ వచ్చేలోగా అధికారికంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారంలో దిగేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఎంతో జతకలిసి ఈ ఎన్నికల్లో తలపడనున్నది. బీజేపీ సైతం నల్గొండ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.
News January 23, 2026
గురుకుల ప్రవేశాల గడువు 25 వరకు పొడిగింపు

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ స్వప్న తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
News January 23, 2026
నల్గొండ మీదుగా ‘అమృత్ భారత్’ రైలు

నల్గొండ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. HYD చర్లపల్లి నుంచి కేరళలోని తిరువనంతపురానికి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వారంతపు సర్వీసుగా నడిచే ఈ రైలులో 11జనరల్, 8స్లీపర్ కోచ్లతో పాటు దివ్యాంగుల కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. తక్కువ ఛార్జీతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.


