News December 20, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డ్

జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేసులను సమర్థవంతంగా చేదించినందుకు డీజీపీ అవార్డును అందించినట్లు వివరించారు.
Similar News
News January 17, 2026
చిత్తూరు: రైతులకు రూ.400 కోట్ల బకాయిలు.?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. చిత్తూరులో 4 కంపెనీలు మాత్రమే రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు జమ చేశాయట. తిరుపతిలో ఒక్క పరిశ్రమ కూడా నగదు జమ చేయలేదు. మరికొన్ని 40 శాతం మందికి చెల్లింపులు చేయగా, 10-14 పరిశ్రమలు ఇప్పటి వరకు రూ.1కూడా ఇవ్వలేదట. ఇంకొన్ని సంస్థలు టన్నుకు రూ.8 వేలకు బదులు రూ.3-4 వేలు జమ చేశాయట. దాదాపు రూ.300-400 కోట్ల వరకు కంపెనీలు రైతులకు బకాయిలు ఉన్నాయి.
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.
News January 17, 2026
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయనుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.


