News April 21, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు

పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచారు. 79 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత అందుకున్నారు. 81 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ, బాబర్లను రిజ్వాన్ వెనక్కి నెట్టారు. నిన్న కివీస్తో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో 3వేల పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్ రిజ్వాన్.
Similar News
News March 26, 2026
ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

IPL-2026లో ముంబై స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.
News March 26, 2026
మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

ఖర్గ్ <<19478356>>ద్వీపం<<>> స్వాధీనానికి US ప్లాన్ చేస్తే యెమన్ సమీపాన ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సరకు రవాణాకు ఇది ఎంతో కీలకం. ఇది మూతబడితే ఆఫ్రికా <<19394249>>చుట్టూ<<>> తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో చమురు సంక్షోభం ముదిరేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హౌతీ ఇరాన్కు మద్దతు తెలిపింది.
News March 26, 2026
కరెంట్ ఛార్జీలపై GOOD NEWS

AP: FY27లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూఅప్ భారమూ వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్లకు ₹15,790Cr రెవెన్యూ లోటును తామే భరిస్తామని APERCకి లేఖ రాసింది. దీనివల్ల 1.30Cr గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది. 22L మంది రైతులకు, 22 లక్షల SC, ST, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్ కొనసాగనుంది. 2L మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గనుంది.


