News December 20, 2025
లింగ మిరియాల కలుపు మొక్కలను ఎలా నియంత్రించాలి?

‘లింగ మిర్యాల’ కలుపు మొక్కలు రబీలో ఉష్ణోగ్రతలు తగ్గాక, అపరాల కోత అనంతరం భూమిలో తేమను పీల్చుకొని పెరిగి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇవి 2 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాపిర్ 200ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. అపరాల కోత తర్వాత లీటరు నీటికి 2,4D సోడియం సాల్ట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. భూములను సకాలంలో దున్నడం, 2,3 ఏళ్లకు లోతు దుక్కులతో ఈ సమస్యను తగ్గించవచ్చు.
Similar News
News January 8, 2026
12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె!

AP: ఆర్టీసీలో ఈ నెల 12 నుంచి సమ్మెకు అద్దె బస్సుల యజమానులు సిద్ధమవుతున్నారు. ఇవాళ అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని వారు చెబుతున్నారు. దీంతో అదనంగా రూ.5,200 ఇవ్వడానికి నిన్న RTC ఆదేశాలిచ్చింది. అయితే రూ.15-20వేల వరకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాగా రాష్ట్రంలో దాదాపు 2,500 అద్దె బస్సులున్నాయి. ఇవి ఆగిపోతే సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.
News January 8, 2026
‘అమెరికా సముద్రపు దొంగ’.. ఆయిల్ ట్యాంకర్ స్వాధీనంపై రష్యా ఫైర్

తమ ఆయిల్ ట్యాంకర్ను US స్వాధీనం చేసుకోవడంపై రష్యా నిప్పులు చెరిగింది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని, అగ్రరాజ్యం చేస్తోన్న Outright Piracy (సముద్రపు దొంగతనం) అంటూ ఆ దేశ రవాణా శాఖ మండిపడింది. ఐస్లాండ్ సమీపంలో తమ నౌకతో కాంటాక్ట్ కట్ అయిందని, అమెరికా చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా సీనియర్ నేతలు హెచ్చరించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.


