News December 20, 2025

అనకాపల్లి: జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు వాయిదా

image

ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు సీఈవో నారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న కారణంగా శనివారం జరగాల్సిన ఈ సమావేశాలను వాయిదా వేశామన్నారు. ఈ విషయాన్ని సభ్యులు, అధికారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 11, 2026

పాకిస్థాన్‌కు యుద్ధం చేసే ధైర్యం లేదు: మనోజ్ కటియార్

image

ఇండియాతో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్థాన్‌కు లేదని వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే పాక్ ఏకైక ఆయుధమని, పరోక్ష యుద్ధంతోనే భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మానెక్‌షా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించారు. భారత సైన్యం బలం భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు.

News January 11, 2026

గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

image

గండికోట ఉత్సవాలలో నేడు(మొదటి రోజు) కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
➤ సాయంత్రం 4:00 – 5:30 గం.వరకు శోభాయాత్ర
➤ 5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
➤ 6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
➤ రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
➤ రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
➤ రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
➤ రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ.

News January 11, 2026

రామారెడ్డి: ఎమ్మెల్యే బ్యాటింగ్.. ఎంపీడీవో బౌలింగ్

image

రామారెడ్డి మండల కేంద్రంలో యువజన నాయకులు నిర్వహిస్తున్న రామారెడ్డి ప్రీమియర్ లీగ్-2026 క్రికెట్ టోర్నమెంట్ శనివారం జరిగింది. మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు జడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన పోటీల్లో పాల్గొని బ్యాటింగ్ చేశారు. నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో కురుమ ప్రవీణ్ బౌలింగ్ వేశారు. యువకులతో కలిసి క్రికెట్ ఆడినందుకు ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు.