News December 20, 2025
నల్గొండ: GOVT జాబ్ కొట్టిన అమ్మాయి

గ్రూప్-3 ఫలితాల్లో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన యువతి సత్తా చాటారు. గ్రామానికి చెందిన నివేదిత గ్రూప్-3 పరీక్షలో విజయం సాధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందారు. తన తల్లిదండ్రులు బిక్షం రెడ్డి, సరిత సహకారం, నిరంతర కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని నివేదిత తెలిపారు.
Similar News
News December 26, 2025
NTR: సీఎం ఆదేశాలు బేఖాతరు.. DRCకి పాలకుల డుమ్మా!

NTR జిల్లా ప్రగతి, అభివృద్ధిపై శుక్రవారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ DRC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట MLA శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. MP కేశినేని, మిగతా MLAలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి దోహదపడే ఈ సమావేశానికి నేతల గైర్హాజరుపై విమర్శలొస్తున్నాయి. DRCలో ప్రజాప్రతినిధులు తప్పక పాల్గొనాలని CM చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినా నేతలు బేఖాతరు చేయడం గమనార్హం.
News December 26, 2025
విద్యార్థులు తప్పక వీక్షించాలి: తిరుపతి DEO

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతోందనితిరుపతి DEO కేవీన్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ఆధునిక, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు తప్పక వీక్షించాలన్నారు.
News December 26, 2025
మేడారం మహా జాతరకు జంపన్నవాగు సిద్ధం..!

మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం జంపన్న వాగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవతల దర్శనానికి ముందు భక్తులు వాగులో పవిత్ర స్నానాలు చేయనున్నారు. ఇందుకోసం రూ.5.50 కోట్లతో ఇసుకను చదును చేసి, 39 బావులను శుభ్రపరిచి పైపులు, మోటార్లు ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నెల 25 నాటికి పనులు పూర్తి చేశారు. అధికారులు, కాంట్రాక్టర్ కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.


