News December 20, 2025

టంగుటూరులో హత్యకు కారణం అదేనా..?

image

టంగుటూరులోని HDFCలో సెక్యూరిటీ గార్డ్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బు కోసమే హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పర్యవేక్షణలో పోలీసులు హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. కాగా పోలీసులు పూర్తి వివరాలు వెళ్లడించాల్సి ఉంది.

Similar News

News December 27, 2025

ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

image

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.

News December 27, 2025

ప్రకాశం: CMపై అసభ్యకర పోస్టులు.. టీచర్‌పై కేసు

image

సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీచర్ పై శుక్రవారం కేసు నమోదైనట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు. కనిగిరికి చెందిన టీచర్ శ్రీనివాసులు చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియోలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నామన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 27, 2025

ఒంగోలులో జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్

image

ఒంగోలులోని సెయింట్ జెవియర్ స్కూల్ లో శనివారం జిల్లా స్థాయి కెరియర్ ఫెస్ట్ కం ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ పీడీ దాసరి అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కెరియర్ పట్ల అవగాహన కలిగించడం, అలాగే వృత్తి విద్యపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీనితో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.