News December 20, 2025
మేడిగడ్డ వ్యవహారం.. L&Tపై క్రిమినల్ కేసు!

TG: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక పనులు చేపట్టిన L&T సంస్థపై క్రిమినల్ కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. L&Tపై క్రిమినల్ కేసుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ వైఫల్యానికి L&Tదే బాధ్యత అని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయనుంది.
Similar News
News February 21, 2026
70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://gailonline.com
News February 21, 2026
ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.
News February 21, 2026
సోమవారం నిర్వహించే ‘విశేష పూజ’

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం రెండో గంట తర్వాత విశేష సేవ జరుగుతుంది. 14 కలశాలతో మలయప్ప స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. వీటిలో ఏడు కలశాలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలు, మిగిలిన ఏడింటిలో శుద్ధజలం ఉంటాయి. పంచసూక్తాల పఠనం మధ్య తిరుమంజనం జరుగుతుంది. హోమం, పూర్ణాహుతి తర్వాత భక్తులకు వస్త్ర బహుమానం ఇస్తారు. 1991లో ప్రారంభమైన ఈ సేవ లోకకళ్యాణార్థం నిర్వహిస్తున్నారు.


