News December 20, 2025

KMR: అడవిలో ఏముంది సోదరా!

image

అధునాతన భారతావని మించి అడవిలో ఏముంది సోదరా.. జనజీవన స్రవంతిని మించి స్వతంత్రమేమి లేదురా. KMR జిల్లాకు చెందిన ఎర్రగొల్ల రవి @ సంతోష్ నిన్న HYDలో DGP సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తన జీవితంలో విలువైన 25 ఏళ్ల సమయాన్ని వృథా చేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు ఇంతకాలం ఎదురు చూసి తపించిపోయారు. అతని రాకకు కుటుంబసభ్యులు, గ్రామస్థులు వేచిచూస్తున్నారు. ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News December 22, 2025

48 గంటల్లోనే జీవో.. మాట నిలబెట్టుకున్న పొంగులేటి..!

image

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన TWJF మహాసభలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధివిధానాలపై 10 రోజుల్లో జీవో ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, ఆ గడువు అవసరం లేకుండానే కేవలం 48 గంటల్లోనే జీవో విడుదల చేయించి మంత్రి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు.

News December 22, 2025

విజయవాడ: అమ్మవారి భక్తులకు ఆన్లైన్ సేవలు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈవో శీనా నాయక్ సూచించారు. www.kanakadurgamma.org వెబ్‌సైట్ ద్వారా లేదా Mana Mithra Phone App (WhatsApp) ద్వారా ఆన్లైన్‌లో పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని భక్తులు సులభంగా టికెట్లు పొందాలని ఆయన కోరారు.

News December 22, 2025

ఏమయ్యా.. నీకు రోజూ అదే పనా?

image

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్టులో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో కండోమ్స్ కోసం ఏకంగా రూ.1.06 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నెలకు సగటున 19 చొప్పున 228 ఆర్డర్‌లు ఇచ్చాడని తెలిపింది. దీంతో ‘ఏం బాబూ నీకు రోజూ అదే పనా?’ అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమకు వచ్చే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ఆర్డర్ ఉందని సంస్థ చెప్పింది.