News December 20, 2025
కొడంగల్: ‘క్రిస్మస్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి’

ఈనెల 24న కొడంగల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే క్రిస్మస్ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని అధికారులు వెల్లడించారు. పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని వారు తెలిపారు.
Similar News
News January 8, 2026
భిక్కనూరు: ఫార్మా ‘సీక్రెట్స్’ బట్టబయలు

భిక్కనూరులో ఫ్యూజన్ ఫార్మాకు ఇప్పటికే 2 ఎకరాల పర్మిషన్ ఉందని, ప్రస్తుత సేకరణ ‘విస్తరణ’ కోసమేనని తెలిసి జనం షాక్ అయ్యారు. ఆకుపచ్చ పరదాల చాటున అప్పుడే పనులు మొదలయ్యాయి. ఇదొక్కటే కాదు, మరికొన్ని కంపెనీలు కూడా సేకరణ జరగకుండానే పర్మిషన్లు పొందాయని పలువురు ఆరోస్తున్నారు. నాయకులు మాత్రం ‘పొలిటికల్ మైలేజ్’ చూస్తున్నారు తప్పా.. పనులు మొదలయ్యాక వీటిని ఆపడం సాధ్యమేనా? అని జనం ఆందోళన చెందుతున్నారు.
News January 8, 2026
జనవరి 8: చరిత్రలో ఈరోజు

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం
News January 8, 2026
కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.


