News December 20, 2025
మన్నెంపల్లిలో వెలుగుచూసిన ‘వీరగల్లు’ శిల్పం

KNR(D)తిమ్మాపూర్(M)మన్నెంపల్లిలో పురాతన యుద్ధ సన్నివేశాన్ని ప్రతిబింబించే ‘వీరగల్లు’ శిల్పం లభ్యమైందని పురావస్తు పరిశోధకుడు ‘డిస్కవరీ మ్యాన్’ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. కరణాలగడీ సమీపంలోని పాలకేంద్రం ఆవరణలో చెత్తాచెదారం శుభ్రంచేస్తుండగా ఈ శిల్పం బయటపడింది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తున్న నల్లరాతిపై ఒక సైనికుడు కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో కళ్లెం పట్టుకుని యుద్ధంచేస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది.
Similar News
News December 24, 2025
RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News December 24, 2025
ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలి: భట్టి

రెవెన్యూ సేవల్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని Dy.Cm భట్టి విక్రమార్క రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. ఇటీవల ఎన్నికైన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా యూనిట్ నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం Dy.Cm ను కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సూచించారు.
News December 24, 2025
రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.


