News December 20, 2025

HYD ‘నైట్ లైఫ్’.. కాగితాలకే పరిమితమైన మెట్రో వేళలు

image

‘నైట్ ఎకానమీ’లో భాగంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయన్న ప్రభుత్వ ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. విజన్-2047 లక్ష్యాల్లో వీటిని చేర్చినప్పటికీ మెట్రో రైళ్లు రాత్రి 11 గంటలకే నిలిచిపోతున్నాయి. అర్ధరాత్రి ప్రయాణాలపై ఇప్పటివరకు ఎలాంటి జీవో వెలువడలేదు. వెబ్‌సైట్‌లోనూ పాత వేళలే ఉండటంతో, సామాన్యులకు ‘మిడ్‌నైట్ మెట్రో’ ప్రయాణం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

Similar News

News January 2, 2026

అయిజ: యూరియా కొరత లేదు- జిల్లా వ్యవసాయ అధికారి

image

గద్వాల జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అయిజలో పర్యటించి పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ ఉన్నంతవరకు రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.

News January 2, 2026

ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.

News January 2, 2026

గుంటూరు: 3 చట్టసభల ఘనాపాఠి.. కల్లూరి చంద్రమౌళి

image

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయంలో కల్లూరి చంద్రమౌళిది చెరగని ముద్ర. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్.. ఇలా 3 వేర్వేరు చట్టసభల్లో ఆయన MLA, మంత్రిగా పనిచేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన ఆయన ఈ ఘనతను సాధించిన తొలి వ్యక్తిగా, రాష్ట్రంలో రికార్డు కలిగిన అతికొద్ది మందిలో ఒకరిగా చరిత్రకెక్కారు. నేడు ఆయనది వర్ధంతి.