News December 20, 2025

రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

image

పామిడి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న వాహనాన్ని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన విషయం విధితమే. ఘటనా స్థలాన్ని పామిడి ఇన్‌ఛార్జ్ సీఐ ప్రవీణ్ కుమార్‌తో కలిసి ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News December 28, 2025

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా ఆదెన్న

image

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఛైర్మన్‌గా రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రభుత్వం ఆదెన్న పేరును సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు పంపారు. శనివారం రాత్రి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. సుమారు 20 ఏళ్లపాటు TDP లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఆదెన్న పనిచేశారు. అనంతపురంలో స్థిరపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

News December 28, 2025

అనంత: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గుత్తి పట్టణంలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260. అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.260. గుంతకల్లులో రూ.220, స్కిన్లెస్ రూ.240గా విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మటన్ రూ.750లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఒక్కసారి ఇలా చికెన్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు అయోమయంలో పడ్డారు.

News December 28, 2025

అనంత: ఈనెల 29న కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శనివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.