News December 20, 2025

విశాఖ: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

image

విశాఖలో రూమ్స్ తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఏడుగురిని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఋషికొండ వద్ద బెంగళూరు, కూర్గ్, వెస్ట్ గోదావరి, అనంతపురం ప్రాంతాలకి చెందిన వినోద్ కుమార్, పరుశురాం, సలీం, చంద్రశేఖర్, చంటి, లక్ష్మి శ్రీనివాస్, ఓంకార్‌నాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రబ్బర్ స్టాంపులు, స్కానర్లు, సిమ్స్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News December 24, 2025

BBJCCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కోల్‌కతాలోని బ్రేత్ వేట్ బర్న్ అండ్ జేసప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(<>BBJCCL<<>>) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా/బీటెక్/BE, MBA, PGDBM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bbjconst.com

News December 24, 2025

అంటే.. ఏంటి?: Triumph

image

ఈ పదం గ్రీకు భాషలో మొదలై మూడు భాషల పరిణామంతో ఇంగ్లిష్‌లోకి వచ్చింది. గ్రీకు భాషలో Thriambos పదం నుంచి లాటిన్‌లోకి triumphusగా మార్చబడింది. దాన్నుంచి పురాతన ఫ్రెంచ్‌లో triumpheగా రూపాంతరం చెంది ఇంగ్లిష్‌లో Triumphగా స్థిరపడింది. ఈ పదం అర్థం ఘన విజయం.
-రోజూ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం.
<<-se>>#AnteEnti<<>>

News December 24, 2025

అపరాలకు బంగారుతీగ కలుపు ముప్పు ఎక్కువ

image

మినుము, పెసర, కందిని ఆశించి నష్టపరిచే కలుపు మొక్కలలో బంగారుతీగ ముఖ్యమైనది. ఇది ఆశించిన పైర్లలో పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులు భారీగా తగ్గిపోతాయి. పొలంలో ఒకసారి బంగారుతీగ విత్తనాలు పడితే కొన్నేళ్ల వరకు మొలుస్తాయి. అందుకే ఈ కలుపు మొక్కను పొలంలో గుర్తిస్తే విత్తనం ఏర్పడక ముందే వాటిని పీకి నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.