News April 21, 2024

ఫ్రూట్ విలేజ్.. ఏడాదికి రూ.50కోట్ల ఆదాయం!

image

మహారాష్ట్రలోని ధుమల్‌వాడీ గ్రామం ‘ఫ్రూట్ విలేజ్’గా ప్రభుత్వ గుర్తింపు పొందింది. 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఒకప్పుడు గోధుమలు, జొన్నలు సాగు చేసేవారు. పంటలు సరిగా పండకపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి, సీజన్‌ను బట్టి 20 రకాల పండ్ల తోటల్ని సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు రూ.40-50కోట్ల ఆదాయం పొందుతున్నారు. దీంతో ఇక్కడి యువ రైతులకు పిల్లనివ్వడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతున్నారట.

Similar News

News February 8, 2026

బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

image

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News February 8, 2026

ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. ఇంకా కోలుకోని పాక్!

image

గతేడాది పాక్‌లోని ఉగ్ర శిబిరాలు, వైమానిక స్థావరాలపై ‘<<16454711>>ఆపరేషన్ సిందూర్<<>>’తో భారత్ విరుచుకుపడటం తెలిసిందే. 10 నెలలవుతున్నా పాక్ కోలుకున్నట్లు లేదు. అక్కడి భోలారీ హాంగర్‌ను ఇంకా రిపేర్ చేసుకోలేదు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను NDTV బయటపెట్టింది. ధ్వంసమైన రూఫ్‌ను తొలగించినట్లు తెలిపింది. మురిద్‌లో టార్పాలిన్ కప్పి పనులు చేస్తున్నారని, సుక్కుర్, నూర్ ఖాన్ బేస్‌లోనూ రిపేర్లు చేస్తున్నట్లు చెప్పింది.

News February 8, 2026

వాలంటైన్స్ డే.. భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్

image

‘వాలంటైన్స్ డే’ అంటే ఒకప్పుడు పార్కులు, రెస్టారెంట్లలో సందడి నెలకొనేది. ఇప్పుడు ప్రేమజంటలు హోటల్ స్టేలకు మొగ్గు చూపుతున్నాయి. ఈ feb14కు గతేడాదితో పోలిస్తే హోటల్ బుకింగ్స్ 175% పెరిగాయని ట్రావెల్ సంస్థలు అంటున్నాయి. గువాహటి, కొలంబో, ఆగ్రా, జైపూర్, గోవా, మనాలి తదితర ప్రాంతాలకు డిమాండ్ అధికమని వెల్లడించింది. స్టేతో పాటు ప్రైవేట్ పార్టీలు, లంచ్-డిన్నర్ తదితర ఎక్స్‌పీరియన్స్‌ ప్రిఫర్ చేస్తున్నారట.