News December 20, 2025
కరీంనగర్: రూ.253.56 కోట్ల మందు తాగేశారు

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో లిక్కర్ ఏరులై పారింది. మొదటి విడత నామినేషన్లు మొదలుకొని చివరి విడత రిజల్ట్ వరకు పల్లెలు మద్యం నిషాతో మత్తెక్కాయి. ఉమ్మడి KNRలో 2025 DEC 1-19 మధ్య కేవలం 19 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.253.56 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. KNR రూ.89.89 కోట్లు, PDPL రూ.58.30 కోట్లు, SRCL రూ.42.83 కోట్లు, JGTL రూ.62.54 కోట్ల మందు IML డిపో నుండి డిస్పాచ్ అయింది.
Similar News
News December 26, 2025
ADB: వివాహితకు యువకుడి వేధింపులు.. SUICIDE

వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్లో చోటుచేసుకుంది. SI శ్రీ సాయి తెలిపిన వివరాలు.. మండలంలోని సాకెర గ్రామానికి చెందిన జాదవ్ స్రవంతి (30)ని అదే గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ రెండేళ్లుగా భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదైంది.
News December 26, 2025
NLG: LOVE AFFAIR.. భర్తను హత్య చేసిన టీచర్

ఓ ప్రభుత్వ టీచర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. CI నాగరాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్-పద్మ దంపతులు అచ్చంపేటలో నివాసముంటున్నారు. పద్మకు తోటి ఉపాధ్యాయుడు గోపితో ఏర్పడిన సంబంధం భర్త హత్యకు దారితీసింది. గత నెల 25న లక్ష్మణ్ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం స్పృహతప్పి పడిపోయినట్లు నాటకమాడగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు.
News December 26, 2025
వికారాబాద్: అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బదిలీ

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో రెవిన్యూ విభాగం అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ను రాష్ట ఎన్నికల కమిషన్ సెక్రటరీగా నియమించింది.


