News April 21, 2024

సంగారెడ్డి: ‘రాజకీయ హత్య కాదు.. కంకర విషయంలో గొడవ’

image

సిర్గాపూర్ మండలం సింగర్ బొగ్డ తండాలో వాడిత్య శ్రీను నాయక్ హత్య రాజకీయ కోణంలో జరగలేదని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి వివరించారు. తండాలో పథకంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మించారు. మిగిలిన కంకరను కాంట్రాక్టర్ జాదవ్ రాజు అమ్మి వేశారు. కొనుగోలుదారు తీసుకెళ్తుండగా శ్రీను నాయక్ అడ్డుకున్నారు. దీంతో 20న తండాలో పంచాయతీ జరగగా జాదవ్ రాజు, అతని సోదరులు శ్రీనుపై దాడి చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

Similar News

News July 10, 2025

మెదక్: యాప్‌లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్‌లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.

News July 10, 2025

మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

image

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్‌లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

News July 9, 2025

మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.