News December 21, 2025

నంద్యాల: ‘ఇలా చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది’

image

నేషనల్ కన్జ్యూమర్స్ డే వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలోని పలు హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవగాహన కల్పించారు. హోటల్స్‌లో ఎక్కువగా కలర్స్ వాడుతున్నారని, వాటిని వాడితే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడతారని తెలిపారు. నాణ్యమైన, ప్రామాణికత గల వస్తువులనే వినియోగించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు రవిబాబు, వెంకటరమణ, ఖదిమ్ వలి, అమిర్ బాషా పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

image

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News December 25, 2025

DGP ఎంపికపై కీలక ఆదేశాలు

image

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

News December 25, 2025

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.

SHARE IT