News December 21, 2025
మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం

TG: జనవరి 28-31 వరకు జరిగే మేడారం జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వింటర్ విడిది కోసం ముర్ము ప్రస్తుతం HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న విషయం తెలిసిందే. నేడు మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కలిసి జాతరకు ఆహ్వానించనున్నారు. మరోవైపు మేడారం గద్దెల పనులు చకాచకా జరుగుతున్నాయి. జాతర కంటే ముందే పనులు పూర్తి కానున్నాయి.
Similar News
News January 5, 2026
అతి త్వరలోనే పెన్షన్ల పెంపు: మంత్రి

TG: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. అతి త్వరలోనే పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు బస్సుల్లో త్వరలోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి బధిర విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా దివ్యాంగుల పెన్షన్లను ₹4,016 నుంచి ₹6వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
News January 5, 2026
ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.
News January 5, 2026
ప్రీ డయాబెటీస్ ఉంటే ఇవి తినాలి

షుగర్ పేషెంట్స్ ముందుగా ‘ప్రీ డయాబెటిక్’ దశను దాటే డయాబెటిక్గా మారుతారు. అయితే డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం ద్వారా దీన్ని రివర్స్ చెయ్యొచ్చంటున్నారు నిపుణులు. మెంతులు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, ఉసిరి రోజూ తీసుకోవడం వల్ల షుగర్ రాకుండా నివారించొచ్చంటున్నారు. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.


