News December 21, 2025
రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయం: CM

రాజయ్య పేటలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని CM చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో మత్స్యకారులు అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం వారికి మాట్లాడే అవకాశం కూడా CM ఇవ్వలేదు. CMతో భేటీకి 30 మందిని అధికారులు శనివారం తాళ్లపాలెం తీసుకెళ్లారు. CM వారితో 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. గ్రామస్థులు చేసిన ఆందోళన.. వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.
Similar News
News January 7, 2026
సంగారెడ్డి: సంక్రాంతికి ప్రత్యేక 503 ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ సర్వీసులతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 503 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు.
News January 7, 2026
వివాహ ఆటంకాలను తొలగించే సర్ప దోష నివారణ

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.
News January 7, 2026
25 రన్స్ చేస్తే సచిన్ను దాటనున్న కోహ్లీ!

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్ ఆడారు.


