News December 21, 2025

రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయం: CM

image

రాజయ్య పేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్ ఏర్పాటు చేయమని CM చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో మత్స్యకారులు అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం వారికి మాట్లాడే అవకాశం కూడా CM ఇవ్వలేదు. CMతో భేటీకి 30 మందిని అధికారులు శనివారం తాళ్లపాలెం తీసుకెళ్లారు. CM వారితో 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. గ్రామస్థులు చేసిన ఆందోళన.. వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.

Similar News

News January 15, 2026

ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

image

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

News January 15, 2026

ఎద్దు మోసినంత, గోనె పట్టినంత

image

పూర్వకాలంలో ధాన్యాన్ని లేదా వస్తువులను కొలవడానికి పెద్ద గోనె సంచులను ఉపయోగించేవారు. ఒక ఎద్దు ఎంత బరువును మోయగలదో, ఒక పెద్ద గోనె సంచిలో ఎంత పరిమాణం పడుతుందో అంత ఎక్కువగా (అంటే చాలా సమృద్ధిగా) ఒకరి దగ్గర ధనం కానీ, వస్తువులు కానీ ఉన్నాయని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. ముఖ్యంగా అపారమైన ఐశ్వర్యాన్ని లేదా విపరీతమైన లాభాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 15, 2026

భారత్‌ మద్దతు కోరుతున్న ఇరాన్!

image

ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు యుద్ధం చేస్తామంటూ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్‌ సాయాన్ని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా తెలిపారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆ దేశంలోని పరిస్థితులపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.