News April 21, 2024
శ్రీరాముడి వారసుడు రాహుల్ గాంధీ: జగ్గారెడ్డి

శ్రీరాముడి పాలన కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్లో మాట్లాడుతూ.. ‘శ్రీ రాముడి వారసుడు రాహుల్ గాంధీ. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్’ అని అన్నారు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తూ ఎదిగిన వ్యక్తి మోదీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 5, 2026
మెదక్: చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని సూసైడ్

మనోహరాబాద్ :చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు
News March 5, 2026
MDK: 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

మెదక్ ఐడిఓసిలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాల అమలు, సమన్వయం, ప్రజలకు సేవలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
News March 5, 2026
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసి నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, బిల్లులు, సామగ్రి సరఫరా, సాంకేతిక పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు.


