News December 21, 2025

బందరు – ప్రయాగ్‌రాజ్‌ మధ్య ప్రత్యేక రైలు

image

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Similar News

News January 5, 2026

కృష్ణా: ఏడాది తొలి వారంలో 417 అర్జీలు

image

మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ జిల్లా అధికారులతో కలిసి PGRS సోమవారం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ.. అన్ని అర్జీలను 72 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. PGRS ద్వారా ఇప్పటివరకు 95% అర్జీలు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలో 417 అర్జీలు అందగా సమస్యల పరిష్కారాన్ని ఆన్‌లైన్‌లో సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేస్తున్నట్లు చెప్పారు.

News January 5, 2026

కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

image

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

News January 5, 2026

కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

image

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.